ETV Bharat / state

నేను చనిపోతే.. ఆ మంత్రిదే బాధ్యత.. మాజీ సర్పంచ్ భర్త సంచలన వ్యాఖ్యలు

author img

By

Published : Feb 7, 2023, 5:44 PM IST

Updated : Feb 7, 2023, 9:49 PM IST

Etv Bharat
Etv Bharat

Minister Meruga Nagarjuna: సర్పంచ్​లు తమ పంచాయతీని అభివృద్ధి చేయడానికి నానా కష్టాలు పడతారు. తీరా అభివృద్ధి చేసిన తరువాత బిల్లుల కోసం అధికారుల చుట్టూ కాళ్లు అరిగేలా తిరుగుతుంటారు. రెండు రోజుల క్రితం సర్పంచ్ భర్త బిల్లులు రాలేదని వీడియో విడుదల చేశాడంతే.. ఇంకేముంది మంత్రి బెదిరింపులు, అక్రమ కేసులకు బనాయించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎవరా మంత్రి, ఎక్కడ జరిగింది.

Minister Meruga Nagarjuna: మంత్రి మేరుగ నాగార్జున వల్ల ప్రాణహాని ఉందని బాపట్ల జిల్లా అమర్తలూరు మండలం మూల్పురు మాజీ సర్పంచ్ భర్త మాణిక్యరావు ఆరోపించారు. బాపట్ల జిల్లా తెనాలిలో మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. తనపై అక్రమ కేసులు పెట్టేందుకు మంత్రి ప్రయత్నం చేస్తున్నారన్నారు. తాను చనిపోతే పూర్తి బాధ్యత మంత్రి మెరుగ నాగార్జునదేనని అన్నారు. బిల్లులు రాకుండా అడ్డుకుంటున్నారనీ వీడియో విడుదల చేసిన తరువాత తనపై కక్ష పెంచుకున్నారని.. ఇంటి చుట్టూ పోలీసులను పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవలే మంత్రిపై ఆరోపణల చేస్తూ మాణిక్యారావు వీడియో విడుదల చేశారు.

నేను చనిపోతే.. ఆ మంత్రిదే బాధ్యత.. మాజీ సర్పంచ్ భర్త సంచలన వ్యాఖ్యలు

తన భార్య రోజ్ మేరీ సర్పంచ్​గా ఉన్న సమయంలో గ్రామాభివృద్దికి సంబంధించిన బిల్లులు రాకుండా మంత్రి అడ్డుకుంటున్నారని వీడియోలో ఆరోపించారు. స్థానిక నాయకుల చేతిలో కీలుబొమ్మగా మారి మంత్రి దళితులను వేధిస్తున్నారని మండిపడ్డారు. మాణిక్యరావు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.

అసలేం జరిగింది: గ్రామాభివృద్దికి సంబంధించిన బిల్లులు రాకుండా మంత్రి మేరుగ నాగార్జున అడ్డుకుంటున్నారని బాపట్ల జిల్లా అమర్తలూరు మండలం మూల్పూరు మాజీ సర్పంచ్ రోజామేరీ భర్త మాణిక్యాల రావు ఆరోపించారు. 2013-18 వరకు రోజామేరీ సర్పంచ్​గా పని చేశారు. ఆ సమయంలో కోట్ల రూపాయలతో పంచాయతీ అభివృద్ధి చేశామని మాణిక్యరావు చెప్పారు. అయితే 14వ ఆర్థిక సంఘం నిధులలో తమకు రావాల్సిన బిల్లులు రాకుండా స్థానిక నాయకుల మాటలు విని మంత్రి మేరుగ నాగార్జున బిల్లులు రానివ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

జిల్లా అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ఎలాంటి ఉపయోగం లేదని వాపోయారు. స్థానిక నాయకుల చేతిలో కీలుబొమ్మగా మారి మంత్రి నాగార్జున దళితులను వేధిస్తున్నారని మండిపడ్డారు. తన ఆవేదనను చెప్పుకుంటున్నందుకు.. కొందరు చంపేస్తామని బెదిరింపులకు పాల్పడడం దారుణమన్నారు.

ఇవీ చదవండి

Last Updated :Feb 7, 2023, 9:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.