TNSF PROTEST: విద్యార్థుల సంక్షేమాన్ని పట్టించుకోకుండా ఎస్.కే.యూనివర్సిటీ వీసీ రామకృష్ణారెడ్డి అక్రమంగా కోట్లు దోచుకుంటున్నారని తెలుగునాడు విద్యార్థుల ఫెడరేషన్ (టీఎన్ఎస్ఎఫ్) నాయకులు ఆరోపించారు. విశ్వవిద్యాలయ ప్రధాన ద్వారం వద్ద నిరసన తెలుపుతున్నవారిని పోలీసులు అరెస్టు చేశారు. వైకాపా పాలనలో విద్యా వ్యవస్థ పూర్తిగా నాశనం అయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని విద్యార్థులు కోరితే అక్రమ కేసులతో భయపెడుతున్నారని ధ్వజమెత్తారు.
ఇవీ చదవండి: