ETV Bharat / state

చీపుర చేతపట్టి.. మురుగు కాల్వను శుభ్రం చేసిన జేసీ ప్రభాకర్ రెడ్డి

author img

By

Published : Apr 18, 2021, 6:57 AM IST

తాడిపత్రి మునిసిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి చీపురు చేత పట్టారు. ప్రజలకు పరిసరాల శుభ్రతపై అవగాహన కల్పించేందుకు స్వయంగా మురుగు కాల్వలను శుభ్రం చేశారు. తాడిపత్రిని రోగరహిత పట్టణంగా చేద్దామన్నారు.

jc prabakar reddy
మురుగు కాలువలు శుభ్రం చేసిన జేసీ ప్రభాకర్ రెడ్డి

అనంతపురం జిల్లా తాడిపత్రి మునిసిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి పరిసరాల పరిశుభ్రత పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు శ్రీకారం చుట్టారు. మన ఇంటి ముందు మనమే శుభ్రం చేసుకుందాం అంటూ చీపురు చేతపట్టి మురుగు కాలువలను శుభ్రం చేశారు.

24వ వార్డు శాస్త్రినగర్​లో మురుగు కాలువలో ఉన్న చెత్త తొలగించారు. పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవడం వల్ల ఎటువంటి రోగాలు దరిచేరవని చెప్పారు. తాడిపత్రిని స్వచ్ఛ మున్సిపాలిటీగా తీర్చి దిద్దే బాధ్యత పట్టణంలోని ప్రతి ఒక్క పౌరుడిపై ఉందన్నారు.

ఇదీ చదవండి:

వైకాపా వర్గీయుల మధ్య ఘర్షణ.. రాళ్లతో దాడి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.