ETV Bharat / state

పోలీస్ స్టేషన్లో వ్యక్తి అనుమానాస్పద మృతి.. సీఐ, ఇద్దరు కానిస్టేబుళ్లు, హోంగార్డ్ సస్పెన్షన్

author img

By

Published : Jan 17, 2023, 6:59 PM IST

Updated : Jan 17, 2023, 7:25 PM IST

Lockup death in Anantapur Distric: అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణ సమీపంలో గొర్రెల దొంగతనానికి పాల్పడిన ఓ వ్యక్తి పోలీస్ స్టేషన్ లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. పోలీసులు పొంతనలేని సమాధానాలు చెప్తుడడంతో స్థానికులు, మృతుని బంధువులు ఆశ్చర్యపోయారు. లాకప్ డెత్ జరిగి ఉంటుందని స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ANATHAPURAM
రాయదుర్గం పోలీస్ స్టేషన్లో అనుమానాస్పద మృతి

Lockup death in Anantapur District: గొర్రెల చోరీ కేసులో అరెస్టై పోలీసుల అదుపులో ఉన్న వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అనంతపురం జిల్లా రాయదుర్గం స్టేషన్ లో జరిగిన ఈ ఘటనపై స్థానికులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆత్మకూరు మండలం సనప గ్రామానికి చెందిన ఆంజనేయులు గొర్రెల దొంగతనానికి పాల్పడడంతో పోలీసులు అరెస్టు చేశారు. విచారణ నిమిత్తం స్టేషన్‌కు తరలించగా.. అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఆంజనేయులు కంప్యూటర్ రూమ్‌లో ఫ్యానుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు చెప్తుండగా.. లాకప్ డెత్ జరిగిందని ప్రజలు అనుమానాలను వ్యక్తం చేశారు.

రూ.7 లక్షల పరిహారం: మృతుడి కుటుంబ సభ్యులతో పోలీసులు ఒప్పందానికి వచ్చినట్లు సమాచారు. మృతుడి కుటుంబ సభ్యులకు రూ.7లక్షలు చెల్లించేందుకు పెద్దమనుషుల సమక్షంలో పోలీసులు అంగీకరించినట్లు తెలుస్తోంది. ముందుగా రూ. 5 లక్షలు చెల్లించారని, మిగతా మొత్తం పోస్టుమార్టం అయిన వెంటనే చెల్లిస్తామని పోలీసులు తెలిపినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

సీఐ, ఇద్దరు కానిస్టేబుళ్లు, హోంగార్డు సస్పెండ్: మృతుల కుటుంబ సభ్యులను పోలీసులే ప్రత్యేక వాహనాల్లో అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం సనప గ్రామం నుంచి రాయదుర్గం తరలించారు. రాయదుర్గం ప్రభుత్వ వైద్యశాలలో ఆంజనేయులు మృతదేహాన్ని చూసిన వెంటనే భార్య, పిల్లలు, కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపించారు. అనంతరం వారిని మీడియా కంట కనబడకుండా ప్రత్యేక గదిలో ఉంచారు. అనంతపురం జిల్లా ఎస్పీ ఫకీరప్ప రాయదుర్గం అర్బన్ సీఐ శ్రీనివాసులు, ఇద్దరు కానిస్టేబుళ్లు, ఒక హోంగార్డును సస్పెండ్ చేశారు.

రాయదుర్గం పోలీస్ సర్కిల్ కార్యాలయాన్ని జిల్లా ఎస్పీ ఫకీరప్ప సందర్శించి మీడియాతో మాట్లాడారు. గొర్రెల దొంగ ఆంజనేయులు అనుమానాస్పద మృతిపై మెజిస్టీరియల్ విచారణకు ఆదేశిస్తున్నట్లు ప్రకటించారు. కళ్యాణదుర్గం ఆర్డీవో నిశాంత్ రెడ్డి, అనంతపురం డీఎప్పీ మహబూబ్ భాషాను విచారించేందుకు ప్రభుత్వం నియమించిందన్నారు.

పోలీసులపై తీవ్ర ఆరోపణలు : పోలీస్ అధికారులు మృతుడి కుటుంబ సభ్యులతో లోపాయి కారి ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోలీసుల వేధింపుల కారణంగా మృతి చెందిన ఆంజనేయులను ఉరివేసి ఆత్మహత్యగా చిత్రీకరించినట్లు తెలుస్తోందని స్థానికులు పేర్కొన్నారు. కళ్యాణదుర్గం డీఎస్పీ శ్రీనివాసుల ఆధ్వర్యంలో రాయదుర్గం పోలీస్ స్టేషన్, ప్రభుత్వ కమ్యూనిటీ వైద్యశాల వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆంజనేయులు మృతదేహానికి రాయదుర్గం ప్రభుత్వ వైద్యశాలలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు.

ఇవీ చదవండి

Last Updated : Jan 17, 2023, 7:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.