ETV Bharat / state

కార్తీకమాస వేళ శివలింగాన్ని తాకిన సూర్యకిరణాలు

author img

By

Published : Nov 18, 2020, 12:43 PM IST

కార్తీకమాసంలో సూర్యకిరణాలు శివలింగాన్ని తాకటం.. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు తరలివచ్చారు. అనంతపురం జిల్లా మడకశిరలోని శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఈ అద్భుతం జరిగింది.

Sunrises touching the Shivalinga
శివలింగాన్ని తాకిన సూర్యకిరణాలు

అనంతపురం జిల్లా మడకశిర పట్టణంలోని సింహగిరి పురాధీశుడు శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో అద్భుతం చోటు చేసుకుంది. కార్తీకమాసం మూడో రోజైన నేడు ఆలయంలోని శివలింగాన్ని సూర్య కిరణాలు తాకాయి. దీంతో అర్చకులు స్వామివారికి అభిషేకాలతోపాటు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సమయంలో స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. అనంతరం భజన కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ప్రతీ ఏటా కార్తీక మాసంలో సూర్యకిరణాలు శివలింగాన్ని తాకడం ఇక్కడ ప్రత్యేకత అని భక్తులు తెలిపారు.

ఇవీ చూడండి...

దాడికి గురైన తెదేపా కార్యకర్తను పరామర్శించిన ఎమ్మెల్యే పయ్యావుల

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.