అనంతపురం జిల్లా ధర్మవరంలో ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ రాష్ట్రస్థాయి హాకీ పోటీలకు అతిథిగా మంత్రి శంకర్ నారాయణ విచ్చేశారు. పతాకావిష్కరణ చేసి హాకీ టోర్నమెంట్ను ప్రారంభించారు. రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి వచ్చిన క్రీడాకారులు ఆయనకు గౌరవ వందనం చేశారు.
తల్లిదండ్రులు పిల్లలను క్రీడలవైపు ప్రోత్సహించాలని.. చదువుతో పాటు క్రీడలు అవసరమని మంత్రి అన్నారు. క్రీడలు వల్ల శారీరక దృఢత్వం, మానసిక ఉల్లాసం కలుగుతాయని చెప్పారు. ధర్మవరంలో ఆడుతున్న క్రీడాకారులు రాణిస్తున్నారని.. వారికి తనవంతు తోడ్పాటు ఇస్తానని మంత్రి పేర్కొన్నారు.
ఇదీ చదవండి: