ETV Bharat / state

అనంతపురంలో రోడ్డు ప్రమాదం... ఇద్దరు మృతి

author img

By

Published : Sep 10, 2020, 6:10 PM IST

అనంతపురంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా మరో ఆరుగురికి గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

అనంతపురంలో ఘోర రోడ్డు ప్రమాదం...ఇద్దరు మృతి
అనంతపురంలో ఘోర రోడ్డు ప్రమాదం...ఇద్దరు మృతి

అనంతపురంలో బెంగళూరు, హైదరాబాద్ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. అనంత గ్రామీణం, ఒడియంపేటకు చెందిన కొంతమంది కూలీలు పని నిమిత్తం ఆటోలో బుక్కచెర్ల గ్రామానికి వెళ్ళి వస్తుండగా ఐచర్ వాహనం ఆటోను ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులు ఒడియం పేటకు చెందిన స్వాతి, సులోచన గా పోలీసులు గుర్తించారు. గాయాలైన ఆరుగురిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:

మూడు రాజధానులు తప్పు లేదు.. హైకోర్టులో కేంద్రం అఫిడవిట్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.