ETV Bharat / state

BUS BOLTHA: ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా.. 8 మందికి గాయాలు!

author img

By

Published : Nov 15, 2021, 11:46 AM IST

private-travels-bus-accident-at-anathapuram-district
ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా.. 8 మందికి గాయాలు!

అనంతరపురం జిల్లా కోడూరుతోపు వద్ద ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్​ టేక్ చేయబోయి.. ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 8 మందికి గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో 35 మంది ప్రయాణికులున్నారు.

అనంతపురం జిల్లా చిలమత్తూరు మండలం కోడూరుతోపు వద్ద ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 8 మందికి గాయాలయ్యాయి. విషయం గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను హిందూపురం ఆస్పత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు.

35 మంది ప్రయాణికులతో బస్సు హైదరాబాద్‌ నుంచి బెంగళూరు వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్​ టేక్ చేయబోయి అదుపుతప్పి బస్సు బోల్తా పడినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చూడండి: కార్తికస్నానంలో విషాదం.. గల్లంతైన ముగ్గురు యువకులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.