ETV Bharat / state

కారు ద్విచక్ర వాహనం ఢీ.. ఒకరు మృతి

author img

By

Published : Aug 26, 2021, 1:28 AM IST

accident
accident

కారు, ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ద్విచక్ర వాహనం రోడ్డు దాటుతుండగా.. వేగంగా వచ్చిన కారు దానిని ఢీకొట్టినట్లు పోలీసులు తెలిపారు.

అనంతపురం జిల్లా పామిడి మండలం రామరాజు పల్లి గ్రామ సమీపంలోని జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనాన్ని, కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చెన్నారెడ్డి అనే వ్యక్తి మృతి చెందాడు. నాగరత్నమ్మ అనే మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆ దంపతులు ద్విచక్ర వాహనంపై రోడ్డు దాటుతున్న సమయంలో వేగంగా వచ్చిన కారు.. ఆ వాహనాన్ని ఢీకొట్టిందని పామిడి సీఐ శ్యామ్ రావు తెలిపారు.

ఇదీ చదవండి: చనిపోతున్నానంటూ సెల్ఫీ వీడియో.. ఆ తర్వాత​ అదృశ్యం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.