ETV Bharat / state

ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ దంపతులు

author img

By

Published : Mar 10, 2021, 12:16 PM IST

అనంతపురం జిల్లా హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సతీసమేతంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. క్యూలైన్లో వేచి ఉండి మరీ... ఎమ్మెల్యే దంపతులు ఓటు వేశారు.

MLA Nandamuri Balakrishna and his wife casted their vote
ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ దంపతులు

పురపాలక ఎన్నికల్లో అనంతపురం జిల్లా హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పట్టణంలోని చౌడేశ్వరి కాలనీ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్​ కేంద్రంలో సతీసమేతంగా ఓటు వేశారు. పోలింగ్ బూత్ నెంబర్ 2/1 వద్ద ఎమ్మెల్యే దంపతులు క్యూలైన్లో వేచి ఉండి ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ కేంద్రం వద్ద బాలకృష్ణతో ఫొటోలు దిగేందుకు అభిమానులు పోటీపడ్డారు.

ఇదీ చదవండి: ఓటు హక్కు వినియోగించుకున్న పవన్ కల్యాణ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.