అనంతపురం జిల్లా హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా సడ్లపల్లిలో జోరుగా ప్రచారం చేస్తున్నారు. వైకాపాకు ఓటు వేస్తే ఎండలో మాడిపోతారని ఎద్దేవా చేశారు. తెదేపాకు ఓటు వేస్తే పచ్చని చెట్టు కింద చల్లని నీడలో గడుపుతారంటూ ప్రజలను తనదైన స్టైల్లో ఓట్లను అభ్యర్థించారు. వైకాపా ప్రభుత్వం రెండేళ్లలో 50 మీటర్లు రోడ్డు వేయలేకపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టణ అభివృద్ధి జరగాలంటే మున్సిపల్ ఎన్నికల్లో తెదేపాకి ఓటువేసి గెలిపించాలని పిలుపునిచ్చారు. పట్టణంలోని 5, 13, 14, 15, 29 వార్డులలో తన ప్రచారాన్ని నిర్వహించారు.
ఇదీ చూడండి. వైకాపాకూ తప్పని అంతర్గత పోరు.. మున్సిపల్ బరిలో భారీగా రెబెల్స్