ETV Bharat / state

హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలి: బాలకృష్ణ

author img

By

Published : Aug 31, 2020, 8:19 PM IST

mla balakriishna in hindupuram ananthapuram district
బాలకృష్ణ, ఎమ్మెల్యే

అనంతపురం జిల్లా హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అభిప్రాయపడ్డారు. ఈ విషయంపై త్వరలోనే ముఖ్యమంత్రి జగన్​ను కలిస్తున్నానని తెలిపారు. ఆయన సానుకూలంగా స్పందిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

అనంతపురం జిల్లా హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రభుత్వాన్ని కోరారు. ఈ విషయంపై త్వరలోనే ముఖ్యమంత్రి జగన్​ను కలిస్తున్నానని తెలిపారు. పట్టణంలోని చౌడేశ్వరి కాలనీలో తన నివాసంలో విలేకర్లతో బాలకృష్ణ మాట్లాడారు.

హిందూపురానికి జిల్లా కేంద్రం అయ్యేందుకు అన్ని అర్హతలు ఉన్నాయన్నారు. ఈ విషయంపై.. అఖిలపక్ష నాయకుల అభిప్రాయాలు తీసుకున్నారు. ఈ మేరకు త్వరలోనే సీఎంను కలుస్తానని.. ఆయన సానుకూలంగా స్పందిస్తారని ఆశాభావం వ్యక్తంచేశారు. అఖిలపక్ష నాయకులు ఇదే స్ఫూర్తితో పోరాటం చేయాలని సూచించారు.

ఇవీ చదవండి:

కాంట్రాక్టర్లూ కోర్టుకు వెళ్లండి.. అప్పుడే న్యాయం: ఆర్​ఆర్​ఆర్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.