ETV Bharat / state

ఆ ఘనత వైకాపా ప్రభుత్వానిదే: మంత్రి శంకరనారాయణ

author img

By

Published : Oct 31, 2020, 6:40 PM IST

దేశ చరిత్రలోనే మునుపెన్నడూ లేని విధంగా బీసీ కులాలకు ప్రాతినిధ్యం కల్పిస్తూ 56 కార్పొరేషన్లను ఏర్పాటు చేసిన ఘనత వైకాపా ప్రభుత్వానిదేనని మంత్రి శంకరనారాయణ అన్నారు.పెనుగొండలో నిర్వహించిన బైక్ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు.

minister shankar narayana
minister shankar narayana

రాష్ట్రంలో 139 బీసీ కులాలకు ప్రాతినిధ్యం కల్పిస్తూ 56 కార్పొరేషన్లను ఏర్పాటు చేసిన ఘనత వైకాపా ప్రభుత్వానిదేనని మంత్రి శంకరనారాయణ అన్నారు. పెనుకొండలో కార్పొరేషన్ల ఛైర్మన్లు, డైరెక్టర్లతో కలిసి బైక్ ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి ... దివంగత వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి పాలాభిషేకం చేశారు. బీసీలకు ఇచ్చిన వాగ్దానం మేరకు కార్పొరేషన్లను ఏర్పాటు చేసి సీఎం జగన్ చరిత్ర సృష్టించారన్నారు.

ఇదీ చదవండి

గుంటూరు జైలు వద్ద ఉద్రిక్తత.. నిరసనకారుల అరెస్ట్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.