ETV Bharat / state

గణాదివారిపల్లిలో పాముకాటుతో వ్యక్తి మృతి

author img

By

Published : Nov 15, 2020, 3:18 PM IST

గణాదివారిపల్లిలో పాముకాటుతో వ్యక్తి మృతి
గణాదివారిపల్లిలో పాముకాటుతో వ్యక్తి మృతి

పాముకాటుతో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన అనంతపురం జిల్లా తనకల్లు మండలం గణాదివారిపల్లిలో జరిగింది.

అనంతపురం జిల్లా తనకల్లు మండలం గణాదివారిపల్లిలో పాముకాటుతో రమణ అనే వ్యక్తి మృతి చెందాడు. శనివారం రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి రమణ భోజనం చేసి నిద్రపోయాడు. నిద్రలో ఉండగా అతన్ని పాముకాటు వేసింది. వెంటనే కుటుంబసభ్యులు అతన్ని కదిరిలోని ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించటంతో అనంతపురం తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు. రమణకు భార్య, ఇద్దరు పిల్లలున్నారు.

ఇదీచదవండి

రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా దీపావళి వేడుకలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.