ETV Bharat / state

లక్ష్మీ నరసింహుడి హుండీ లెక్కింపు

author img

By

Published : Mar 27, 2021, 8:56 AM IST

అనంతపురం జిల్లా పెన్నహోబిలంలో ప్రసిద్ధి చెందిన లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం హుండీ ఆదాయాన్ని లెక్కించారు. 80 రోజులకు రూ.10.35 లక్షల ఆదాయం వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.

lakshmi narsimhudu hundi counting
లక్ష్మీ నరసింహుడి హుండీ లెక్కింపు

అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం పెన్నహోబిలంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయ హుండీ ఆదాయాన్ని శుక్రవారం ఆలయ అధికారులు లెక్కించారు. 80 రోజులకు 10 లక్షల 35 వేల 990 రూపాయలు ఆదాయం వచ్చిందని ఈవో సాకే రమేష్ బాబు పేర్కొన్నారు. గతంలో రూ.8 లక్షల 86 వేల 400 రాగా.. ఈసారి రూ. 1.లక్ష 49 వేల 590 రూపాయల మేర ఆదాయం పెరిగిందన్నారు. దేవాదాయ శాఖ ఇన్​స్పెక్టర్​ రామతులసి పర్యవేక్షణలో హుండీ లెక్కించారు.

ఇదీ చదవండి: అనంతపురం జిల్లాలో అటకెక్కిన బిందు సేద్యం రాయితీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.