అనంతపురం జిల్లా పెనుకొండలో విజయదశమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఉత్సవ విగ్రహాలను జమ్మి చెట్టుకు తీసుకువెళ్లి, అక్కడ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పట్టణంలో ఊరేగింపు నిర్వహించారు. ఏటా విజయదశమి రోజున ఈ ఉత్సవాలను నిర్వహిస్తారు. అయితే గత రెండు సంవత్సరాలుగా కొవిడ్ మహమ్మారితో ఉత్సవాలు జరపలేదు. ఈ ఏడాది ప్రభుత్వం ఉత్సవాలు జరుపుకునేందుకు అనుమతి ఇవ్వడంతో.. కొవిడ్ నిబంధనలను పాటిస్తూ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. జంబూ సవారీ (విగ్రహాల ఊరేగింపు) తిలకించడానికి ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు.
ఇదీ చదవండి: