అనంతపురం జిల్లా పామిడి మండలం గజరాంపల్లిలో యువ రైతు మృతి చెందటం ఆందోళనకు దారి తీసింది. గ్రామానికి చెందిన అరుణ్ కుమార్ రెడ్డి అనే యువ రైతు గత నెల 29వ తేదీన ఆత్మహత్యాయత్నం చేసుకోగా... చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు.
అరుణ్ కుమార్ తండ్రి రామచంద్ర రెడ్డి తమ పొలాన్ని గ్రామానికి చెందిన హనుమంత్ రెడ్డి వద్ద తాకట్టు పెట్టాడు. అయితే అసలు, వడ్డీ రెండూ చెల్లించకపోతే పొలాన్ని స్వాధీనం చేసుకుంటానంటూ హనుమంత్ రెడ్డి పత్రం రాయించుకున్నాడు. దీనివల్ల మనస్థాపానికి గురైన అరుణ్ కుమార్ రెడ్డి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఐదు రోజులుగా చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు.
అరుణ్ కుమార్ మృతితో ఆగ్రహించిన బంధువులు పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని గ్రామానికి తీసుకువచ్చి హనుమంత్ రెడ్డి ఇంటి ఎదుట గుంత తవ్వి ఖననం చేసేందుకు ప్రయత్నించారు. గ్రామస్తులు పెద్ద ఎత్తున హనుమంత్ రెడ్డి ఇంటివద్ద గుమిగూడారు. విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు.
ఇదీ చదవండి