ETV Bharat / state

యాడికి జలదిగ్బంధం

author img

By

Published : Sep 25, 2019, 10:46 AM IST

తెల్లవారు జామునుంచి కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు చెరువులు పొంగి కాలనీల్లోకి రావటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

యాడికి జలదిగ్బంధం

యాడికి జలదిగ్బంధం
అనంతపురం జిల్లా యాడికి మండలంలో కురిసిన భారీ వర్షాలకు గ్రామ సమీపంలో ప్రధాన రహదారులు, కాలనీలు వరద నీటిలో చిక్కుకున్నాయి. వాగులు, వంకలు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో రాకపోకలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పిన్నెపల్లి గ్రామ సమీపంలో వాగు పొంగి ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో తమ్మేపల్లి, లలేప్ప కాలనీ, రెడ్ల గుడిసెలు మునిగిపోవటంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. చేనేత, వండ్రంగి పనులు చేసుకునే వారి ఇళ్లల్లోకి వరద నీరు చేరటంతో తీవ్రంగా నష్టపోయామంటూ వారు వాపోతున్నారు. ఉదయం నుంచి అల్పాహారం తీసుకోవటానికైనా ఆస్కారం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తీవ్రంగ నష్టపోయన తమను ప్రభుత్వమే ఆదుకోవాలని వారు కోరుతున్నారు. వరదలో చిక్కుకున్న బాధితులను ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, ఎస్పీ సత్య ఏసుబాబుపరామర్శించారు.

ఇదీ చదవండి : " సర్వం కోల్పోయి కట్టుబట్టలతో రోడ్డున పడ్డాం"

Intro:స్క్రిప్ట్ కరువు ప్రాంతమైన రాయచోటి కి కృష్ణా జలాలను సంక్రాంతి లోపు తీసుకొస్తామని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు తన కార్యాలయంలో మంగళవారం జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు అనంతపురం జిల్లా కదిరి సమీపంలో హంద్రీనీవా కాలవ పనులు నత్తనడకన సాగుతున్నాయని అక్కడ పూర్తి కావాల్సిన 80 మీటర్ల సొరంగం పనులను వేగవంతం చేసే దిశగా గుత్తేదారులు చర్చి ఒప్పించాను అన్నారు బుధవారం కదిరి పుట్టపర్తి ఎమ్మెల్యేలతో కలిసి కర్నాల్ ప్రాంతాన్ని పరిశీలిస్తామన్నారు ఈ పనులు పూర్తి చేయించి వెలిగల్లు ప్రాజెక్టు శ్రీనివాసపురం రిజర్వాయర్ లకు కృష్ణా జలాలను తరలించవచ్చు అన్నారు ముఖ్యమంత్రి సాగునీటికి ప్రధానం చేస్తూ గండికోట రిజర్వాయర్ సామర్థ్యం పెంపు తోపాటు అక్కడ నుంచి వేంపల్లి చక్రాయపేట మీదుగా రాయచోటి నియోజకవర్గం లోని లక్కిరెడ్డిపల్లి రామాపురం మండలాలకు ఎనిమిది వందల కోట్లతో జి ఎన్ ఎస్ పథకంలో భాగంగా సాగునీటిని తీసుకొస్తామన్నారు ఈ పథకంలో కల్పనకు ప్రతిపాదనలు తయారు చేయాలని రూ 3 కోట్లు నిధులు కూడా ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు రాయచోటి నియోజకవర్గం లోని అన్ని ప్రాంతాలకు తాగునీరు ఇచ్చేందుకు శాశ్వత నీటి పథకాన్ని రూపొందిస్తున్నారు గండికోట ప్రాజెక్టు నుంచి పైపులైన్ ద్వారా నియోజకవర్గంలోని చిన్నమండెం రామాపురం లక్కిరెడ్డిపల్లి రాయచోటి పట్టణానికి అనుసంధానం చేస్తామని ఆయన వివరించారు ఈ పనులన్నింటికీ డిసెంబర్ 26 తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేస్తారని ఆయన వివరించారు


Body:బైట్ గడికోట శ్రీకాంత్ రెడ్డి ప్రభుత్వ చీఫ్ విప్


Conclusion:గడికోట శ్రీకాంత్ రెడ్డి ప్రభుత్వ చీఫ్ విప్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.