ఆ గ్రామానికి వెళ్లాలంటే... సమాధులే స్వాగతం పలుకుతాయి

author img

By

Published : Nov 3, 2021, 2:21 PM IST

Updated : Nov 4, 2021, 1:16 PM IST

Final funeral at Beside the road

ఏ గ్రామమైనా పచ్చటి చెట్లతో.. ఆహ్లాదకరమైన వాతావరణంతో ఊర్లోకి స్వాగతం పలుకుతాయి. కానీ ఆ గ్రామం మాత్రం సమాధులతో స్వాగతం పలుకుతోంది. సమాధులు స్వాగతం పలకడం ఏంటి అనుకుంటున్నారా... అయితే ఈటీవీ భారత్ మీ కోసం అందిస్తోంది ఈ ప్రత్యేక కథనం.

ధనాపురం

ఏ గ్రామమైనా పచ్చని చెట్లతో కళకళలాడుతుంటాయి. ఎవరైనా ఎంత దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చినా.. ఆ ఆహ్లాదకర వాతావరణానికి అలసట మరిచిపోతారు. కానీ అనంతపురం జిల్లా పరిగి మండలం ధనాపురం గ్రామంలో మాత్రం పరిస్థితి వేరు. ఆ గ్రామానికి ఎవరైనా రావాలంటేనే భయపడుతుంటారు. రోడ్డు పక్కనే మృతదేహాలను ఖననం చేస్తుండటంతో పలువురు ఇబ్బందులు పడుతున్నారు.

ధనాపురం గ్రామానికి దశాబ్దాల కాలం నుంచి శ్మశాన వాటిక లేదు. దీంతో ఆ గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గ్రామంలో ఎవరైనా చనిపోతే వారి మృతదేహాన్ని గ్రామానికి వచ్చి వెళ్లే రహదారి పక్కనే ఖననం చేయాల్సి వస్తోంది. అంతేకాకుండా కొంతకాలం తర్వాత ఒక మృతదేహాన్ని పూడ్చినచోటే.. మరో మృతదేహాన్ని పూడ్చాల్సి వస్తోందని ఆ గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.

ధనాపురం గ్రామంలో శ్మశాన వాటిక ఏర్పాటు కోసం పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయిందని వారు వాపోతున్నారు. ధనాపురం గ్రామం పరిసర ప్రాంతాల్లో ప్రభుత్వ భూమి లేకపోవడం చేత ప్రభుత్వమే రైతు వద్ద నుంచి స్థలం కొనుగోలు చేసి శ్మశాన వాటిక ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.

ఇదీ చదవండి :

Illegal mining: కొండలను..కొల్లగొడుతున్నారు !

Last Updated :Nov 4, 2021, 1:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.