ETV Bharat / state

BHARAT BANDH: కుందుర్పిలో ఓ వ్యక్తి వినూత్న నిరసన

author img

By

Published : Sep 27, 2021, 4:34 PM IST

కుందుర్పిలో ఆరగుండుతో నిరసన
కుందుర్పిలో ఆరగుండుతో నిరసన

అనంతపురం జిల్లా కుందుర్పిలో ఓ దళిత నాయకుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా అరగుండు, అరమీసం గీయించుకున్నాడు. రైతులకు వ్యతిరేకంగా కేంద్రం చేసిన చట్టాలను(BHARAT BANDH NEWS) వెంటనే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

అనంతపురం జిల్లా కుందుర్పి మండలం కేంద్రంలో ఓ దళిత నాయకుడు అర గుండు గీయించుకుని ప్రభుత్వానికి తన వ్యతిరేకతను వ్యక్తపరిచాడు. కుందుర్పి(KUNDURPI) మండల కేంద్రానికి చెందిన దళిత నాయకుడు హనుమంతరాయుడు.. భారత్ బంద్​లో భాగంగా తెలుగుదేశం పార్టీ నాయకులతోపాటు కలిసి నిరసన కార్యక్రమంలో పాల్గొన్నాడు. రైతులకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టాలను(BHARAT BANDH NEWS) వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ.. హనుమంతరాయుడు అర గుండు, అర మీసం తీసుకుని తన నిరసన వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి:

వైకాపా Vs జనసేన.. సినిమా టిక్కెట్ల వివాదంపై మాటల తుటాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.