ETV Bharat / state

Power Cut: రూ.6.5 కోట్ల విద్యుత్ బకాయి..మున్సిపల్ కార్యాలయానికి పవర్ కట్

author img

By

Published : Sep 1, 2021, 6:52 PM IST

విద్యుత్ బకాయిలు చెల్లించకపోవటంతో అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపాలిటీ కార్యాలయానికి విద్యుత్ అధికారులు కరెంట్ సరఫరా నిలిపేశారు. విద్యుత్ సరఫరా తొలగించడంతో కంప్యూటర్లు పనిచేయక పలు రశీదులు, ధ్రువీకరణ పత్రాల జారీలో జాప్యం జరుగుతోంది.

మున్సిపల్ కార్యాలయానికి పవర్ కట్
మున్సిపల్ కార్యాలయానికి పవర్ కట్

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపాలిటీ కార్యాలయానికి విద్యుత్ అధికారులు కరెంట్ సరఫరా నిలిపేశారు. రూ. 6.5 కోట్ల మేర బకాయిలు ఉండటంతో విద్యుత్ సరఫరా నిలిపివేసినట్లు విద్యుత్ శాఖ ఏఈఈ గంగాధర వెల్లడించారు. కనీసం ఈ నెలకు సంబంధించిన రూ.15.5 లక్షల బిల్లులు చెల్లించినా విద్యుత్ సరఫరాను పునరుద్ధరిస్తామని తెలిపారు.

మున్సిపల్ కార్యాలయానికి పవర్ కట్

"మున్సిపాలిటీ రూ. 6.50 కోట్లు బకాయి ఉంది. ప్రతి నెలా రూ.15 నుంచి 17 లక్షల బిల్లు వస్తోంది. అది కూడా కట్టడం లేదు. ఆ డబ్బు కట్టిన తర్వాత కరెంట్ పునరుద్ధరిస్తాం. ఈ నెలకు సంబధించిన బకాయిలు చెల్లించినా..విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తాం"- గంగాధర, ఏఈఈ

మున్సిపాలిటీ కార్యాలయానికి విద్యుత్ సరఫరా తొలగించడంతో కంప్యూటర్లు పని చేయక పలు రశీదులు, ధ్రువీకరణ పత్రాల జారీలో జాప్యం జరుగుతోంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఇదీ చదవండి

CM JAGAN: గ్రామ సచివాలయాల్లో 2,038 పోస్టుల భర్తీకి సీఎం జగన్​ అంగీకారం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.