ETV Bharat / state

రైతులను ముంచిన నివర్ తుపాను.. భారీగా పంటనష్టం

author img

By

Published : Nov 28, 2020, 10:48 AM IST

నివర్ తుపాను ప్రభావంతో అనంతపురం జిల్లాలో మూడు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. కదిరి వ్యవసాయ సబ్ డివిజన్ పరిధిలో పంట నష్టాన్ని అధికారులు అంచనా వేశారు.

crop loss due to heavy rain
crop loss due to heavy rain

నివర్ తుపాను అనంతపురం జిల్లా రైతులను నిండాముంచింది. ఎడతెరిపిలేని వర్షాలతో పంటలు బాగా దెబ్బతిన్నాయి. కదిరి నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో రహదారులు దెబ్బతిన్నాయి. కదిరి వ్యవసాయ సబ్ డివిజన్ పరిధిలో కోత దశలో ఉన్న వరిపంట పూర్తిగా దెబ్బతింది. దాదాపుగా 427.7 హెక్టార్లలో నష్టం వాటిల్లినట్లు అంచనా వేశారు. నష్టపోయిన రైతులను అన్ని విధాలా ఆదుకుంటామని స్థానిక ఎమ్మెల్యే సిద్దారెడ్డి తెలిపారు.

ఇదీ చదవండి: రెండు వారాల్లో 2 వాయుగుండాలు..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.