ETV Bharat / state

FIGHT: ఇరు కుటుంబాల మధ్య ఘర్షణ... ఒకరు మృతి

author img

By

Published : Jul 15, 2021, 5:56 PM IST

అనంతపురం జిల్లా పెనుకొండ మండలం గొందిపల్లిలో ఇరు వ్యవసాయ కుటుంబాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా మరో ఐదుగురు గాయపడ్డారు.

ఇరు కుటుంబాల మధ్య ఘర్షణ
ఇరు కుటుంబాల మధ్య ఘర్షణ

అనంతపురం జిల్లా పెనుకొండ మండలం గొందిపల్లిలో ఇరు వ్యవసాయ కుటుంబాల ఘర్షణలో ఒకరు మృతి చెందగా ఐదుగురు గాయపడ్డారు. ఒకరి ఇంటికి అనుకుని మల్బరీ షెడ్డు ఉంది. షెడ్డు నిర్వహణ విషయంలో ఇరువురి మధ్య తలెత్తిన వివాదం ఘర్షణకు దారితీసింది.

ఇరువర్గాలు కొడవళ్లతో పరస్పరం దాడి చేసుకున్నాయి. మంజునాథ్ రెడ్డి మృతి చెందగా.. అంజన్ రెడ్డి, ఆనంద్ రెడ్డి, నారాయణ రెడ్డి, అశ్వత రెడ్డి, సురేందర్ రెడ్డి గాయపడ్డారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని అనంతపురం ఆస్పత్రికి తరలించారు.

ఇదీ చదవండి:

అక్కాచెల్లెళ్ల ఘనత- ఒకేసారి ముగ్గురికి ప్రభుత్వ ఉద్యోగం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.