ETV Bharat / state

BALAKRISHNA: కదనరంగంలో బాలయ్య.. వారికి మద్దతుగా నేడు మౌన దీక్ష

author img

By

Published : Feb 3, 2022, 4:14 PM IST

Updated : Feb 4, 2022, 6:13 AM IST

MLA Balakrishna
MLA Balakrishna

16:12 February 03

అంబేడ్కర్‌ విగ్రహం వద్ద బాలకృష్ణ మౌన దీక్ష

MLA Balakrishna Deeksha : హిందూపురంలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నేడు మౌన దీక్ష చేయనున్నారు. హిందూపురాన్ని జిల్లా కేంద్రం చేయాలని డిమాండ్ చేస్తూ.. ఉదయం పట్టణంలోని పొట్టి శ్రీరాములు విగ్రహం నుంచి అంబేడ్కర్‌ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించనున్నారు. అనంతరం అంబేడ్కర్‌ విగ్రహం వద్ద బాలకృష్ణ మౌన దీక్ష చేయనున్నారు. అనంతరం పార్టీ కార్యకర్తలతో తన నివాసంలో బాలకృష్ణ సమావేశం నిర్వహించనున్నారు.

నేడు సాయంత్రం అఖిలపక్షాల నేతలతో చర్చించి.. తదపరి ఉద్యమ కార్యచరణపై స్పష్టతనివ్వనున్నారు. అనంతరం అఖిలపక్షాలతో కలిసి ఎల్లుండి అనంతపురం వెళ్లి కలెక్టర్‌కు వినతిపత్రం ఇవ్వనున్నారు.

రాజకీయం చేయొద్దు..

హిందూపురం కేంద్రంగా సత్యసాయి జిల్లాని ప్రకటించాలని ప్రముఖ సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గత కొంతకాలంగా డిమాండ్ చేస్తున్నారు. జిల్లాల ఏర్పాటు విషయంలో రాజకీయం చేయొద్దని హితవు పలికారు. వైకాపా ఇచ్చిన హామీ మేరకు ప్రతి లోక్‌సభ కేంద్రం ఒక జిల్లా కావాలని బాలకృష్ణ అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లాలో హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు వీడియో సందేశం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.

'అన్ని రంగాల్లో హిందూపురం అభివృద్ధి చెందిందని.. జిల్లా కేంద్రానికి అవసరమయ్యే సదుపాయాలు అక్కడ పుష్కలంగా ఉన్నాయి. పరిసర ప్రాంతాల వాసులు హిందూపురం జిల్లా కేంద్రంగా ఏర్పడుతుందని ఎంతో ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాల ఏర్పాటు విషయంలో రాజకీయం చేయొద్దు. వెంటనే హిందూపురం కేంద్రంగా సత్యసాయి జిల్లాని ప్రకటించాలి' అని రాష్ట్ర ప్రభుత్వాన్ని బాలయ్య డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి

Balakrishna: హిందూపురం కేంద్రంగా సత్యసాయి జిల్లా ప్రకటించాలి: బాలకృష్ణ

Last Updated :Feb 4, 2022, 6:13 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.