ETV Bharat / state

యోగివేమన ప్రాజెక్టు వద్ద వేటకొడవళ్లతో దాడి.. ఒకరు మృతి

author img

By

Published : May 17, 2021, 12:45 PM IST

murder in Anantapur district
యోగివేమన ప్రాజెక్టు వద్ద వేటకొడవళ్లతో దాడి

అనంతపురం జిల్లా యోగివేమన ప్రాజెక్టు వద్ద ఒకరు దారుణ హత్యకు గురయ్యారు. మృతులకు సంబంధించిన వివరాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

అనంతపురం జిల్లా ముదిగుబ్బ మండలం యోగివేమన ప్రాజెక్టు వద్ద ఇద్దరిపై దాడి జరిగింది. ద్విచక్ర వాహనంలో ప్రధాన రహదారిపై వెళ్తున్న ఇద్దరిపై ప్రత్యర్థులు వేటకొడవళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో 35 ఏళ్ల వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.

తీవ్రంగా గాయపడిన మరో వ్యక్తిని చికిత్స నిమిత్తం కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి వివరాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ ఘటనపై ముదిగుబ్బ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

ఇవీ చదవండి:

ట్రాన్స్​ఫార్మర్ ఎక్కి యువతి ఆత్మహత్యాయత్నం

అనుమానాస్పద స్థితిలో.. మహిళ మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.