ETV Bharat / state

SUICIDE: విషం తాగి యువకుడు ఆత్మహత్య

author img

By

Published : Jun 20, 2021, 9:40 PM IST

Updated : Jun 20, 2021, 10:48 PM IST

విషం తాగి యువకుడు ఆత్మహత్య
విషం తాగి యువకుడు ఆత్మహత్య

తల్లిదండ్రులు మందలించారని ఓ యువకుడు అత్మహత్య చేసుకున్న ఘటన అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలంలో జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.



అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని బిజెపి కొట్టాలలో నితీష్​యాదవ్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లిదండ్రులు మందలించారని విషం తాగి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. మృతుడు కర్నూలు జిల్లా మద్దికెర మండలవాసిగా పోలీసులు గుర్తించారు. నితీష్​యాదవ్ కుటుంబం అనంతపురంలోని మున్నానగర్​లో నివాసమున్నట్లు వారు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:

కాబోయే భర్తను తాళ్లతో కట్టేసి..యువతిపై సామూహిక అత్యాచారం!

Last Updated :Jun 20, 2021, 10:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.