ETV Bharat / state

Rape: ఎనిమిదో తరగతి బాలికపై మేనమామ అత్యాచారం

author img

By

Published : Oct 26, 2021, 9:45 AM IST

అనంతపురం జిల్లాలో సభ్య సమాజం తలదించుకునే ఘటన జరిగింది. 8వ తరగతి చదువుతున్న బాలికపై ఆమె మేనమామ అత్యాచారానికి(rape) పాల్పడ్డ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఫలితంగా ఆ చిన్నారి గర్భం దాల్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

rape
rape

అనంతపురం జిల్లా(Ananpuram district) కళ్యాణదుర్గంలో జరిగిన అత్యాచారం.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎనిమిదో తరగతి చదువుతున్న చిన్నారిపై ఆమె మేనమామ అత్యాచారానికి(rape) పాల్పడ్డాడు. ఫలితంగా ఆ చిన్నారి గర్భం దాల్చింది. 11 వారాల గర్భవతిగా వైద్యులు గుర్తించారు.

విషయం తెలుసుకున్న ఆమె తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడు చిన్నా పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. చిన్నాపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశామన్నారు.

ఇదీ చదవండి

Suspension: ఉపాధ్యాయుడిపై కేసు నమోదు.. విధుల నుంచి తొలగింపు.. ఎందుకంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.