ETV Bharat / state

అనంతలో కరోనా విజృంభణ... తాజాగా 134 కేసులు

author img

By

Published : Jul 2, 2020, 8:32 PM IST

కరోనా వైరస్ ఉద్ధృతి రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. అనంతపురం జిల్లాలో తాజాగా 134 మందికి కరోనా సోకింది. వీరిలో 106 గురు అనంతపురం నగరానికి చెందినవారే కాగా ... ఇప్పటివరకూ తొమ్మిది మంది మృతి చెందారు.

134 new corona positive cases registred in ananthapur district
అనంతలో తాజాగా 134 కరోనా కేసులు నమోదు

అనంతపురం జిల్లాలో కరోనా వైరస్ రోజురోజుకు విజృంభిస్తోంది. జిల్లాలో తాజాగా 134 మంది వైరస్ బారిన పడ్డారు. వీరిలో 106 మంది అనంతపురం నగరానికి చెందిన వారే. నగరంలోని నాయక్​నగర్, పాతూరు, ఓబులదేవరనగర్​ల నుంచే ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయని అధికారులు వెల్లడించారు. ఈ మేరకు రాకపోకలపై పూర్తిగా నిషేధం విధించారు. మొత్తం జిల్లా వ్యాప్తంగా 1823 మందికి మహమ్మారి సోకగా... వీరిలో తొమ్మిది మంది మృతి చెందారు. 731 మంది కొవిడ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఇదీ చదవండి: రాష్ట్రంలో కొత్తగా 845 కరోనా కేసులు.. ఐదుగురు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.