ETV Bharat / state

ఆర్టీసీ స్థలాల లీజుపై.. అన్ని రాజకీయ పార్టీలను సంప్రదించాలి: అయ్యన్నపాత్రుడు

author img

By

Published : Sep 26, 2022, 7:28 PM IST

Etv Bharat
Etv Bharat

Ex Minister Ayyanna Patrudu: ఆర్టీసీ భూములను ప్రైవేటు వ్యక్తులకు లీజుకు అప్పగించే ముందు అన్నీరాజకీయ పార్టీలను సంప్రదించాలని మాజీ మంత్రి, తెదేపా నేత అయ్యన్న పాత్రుడు సూచించారు. దీనికి సంబంధించిన వీడియోను ఆయన విడుదల చేశారు.

Ex Minister Ayyanna comments: ఆర్టీసీ స్థలాన్ని ప్రైవేటు వ్యక్తులకు లీజుకి అప్పగించే ముందు అన్నీ రాజకీయ పార్టీలతో సంప్రదించి నిర్ణయం తీసుకోవాలని మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు పేర్కొన్నారు. ఎన్టీఆర్​ హయాంలో ఆర్టీసీ డిపో, బస్‌స్టాండ్​ను మంజూరు చేయించామని అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో మీడియాకు విడుదల చేసిన వీడియోలో తెలిపారు. ఆర్టీసీలో కొంత స్థలాన్ని లీజు ప్రాతిపదికన షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి స్థానిక అధికారులు ప్రకటన జారీ చేశారని.. గతంలో తెదేపా హయాంలోనే ఈ ప్రతిపాదనకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టామన్నారు. మళ్లీ అదే ప్రతిపాదనను తెర మీదకు తీసుకురావటం విడ్డూరంగా ఉందన్నారు.

తెదేపా నేత అయ్యన్న పాత్రుడు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.