పూడిమడక తీరంలో గాలింపు పూర్తి.. గల్లంతైన ఆరుగురి మృతదేహాలు వెలికితీత

author img

By

Published : Jul 30, 2022, 8:49 AM IST

Updated : Jul 30, 2022, 2:10 PM IST

search
కొనసాగుతున్న గాలింపు ()

పూడిమడక తీరంలో గల్లంతైన ఆరుగురి మృతదేహాలు లభ్యమయ్యాయి. 2 హెలికాప్టర్లు, 4 బోట్ల ద్వారా గాలింపు చర్యలు చేపట్టిన అధికారులు... మృతదేహాలను వెలికితీశారు.

అనకాపల్లి జిల్లా పూడిమడక తీరంలో గల్లంతైన ఆరుగురి మృతదేహాలు లభ్యమయ్యాయి. 2 హెలికాప్టర్లు, 4 బోట్ల ద్వారా విద్యార్థుల కోసం గాలించిన అధికారులు వారి మృతదేహాలను వెలికితీశారు. నిన్న పూడిమడక బీచ్‌కు వచ్చిన 15 మంది ఇంజినీరింగ్‌ విద్యార్థుల్లో ఆరుగురు విద్యార్థులు గల్లంతయ్యారు. గల్లంతైనవారు అనకాపల్లిలోని డీఐఈటీ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులుగా అధికారులు గుర్తించారు.

గల్లంతైన పవన్ సూర్యకుమార్‌ (గుడివాడ) గణేశ్‌(మునగపాక), జగదీశ్‌(గోపాలపట్నం), రామచందు(ఎలమంచిలి), విద్యార్థి సతీశ్‌(గుంటూరు), జశ్వంత్‌(నర్సీపట్నం)ల మృతదేహాలను వెలికితీశారు.

ఇదీ జరిగింది: శుక్రవారం డైట్‌ కళాశాలకు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థులు మొత్తం 12 మంది పరీక్షలు ముగిసిన తర్వాత విహారం కోసం అనకాపల్లి జిల్లా పూడిమడక బీచ్‌కు వచ్చారు. 12 మందిలో ఒకరు ఒడ్డు మీద కూర్చుని ఉండగా.. 11 మంది సముద్రంలోకి స్నానానికి దిగారు. కాసేపటికి లోపలికి దిగిన విద్యార్థులపైకి ఓ రాకాసి అల వచ్చి పడింది. దీంతో వారు లోపలికి వెళ్లారు. కాసేపటికే ఐదుగురు తిరిగి తీరానికి కొట్టుకొచ్చారు. ఏడుగురు మాత్రం బయటికి రాలేకపోయారు. ఒడ్డు మీద ఉన్న విద్యార్థితో పాటు బయటికి వచ్చిన వారు పెద్దగా అరవడంతో దగ్గర్లో ఉన్న స్థానికులు ఇద్దరిని బయటికి తీసుకొచ్చారు. వారిలో నర్సీపట్నం మండలం పెద్దబొడ్డేపల్లికి చెందిన గుడివాడ పవన్‌ సూర్యకుమార్‌ ప్రాణాలు కోల్పోయాడు. మరో విద్యార్థిని అనకాపల్లి జిల్లా మునగపాకకు చెందిన సూరిశెట్టి తేజను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

సముద్ర తీరంలో జరిగిన విషాద ఘటనపై సీఎం జగన్ ఆరా తీశారు. విద్యార్థుల గల్లంతుపై సీఎం జగన్‌ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు అండగా ఉండాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

పూడిమడక తీరంలో గాలింపు పూర్తి

ఇవీ చదవండి:

Last Updated :Jul 30, 2022, 2:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.