ETV Bharat / state

అయ్యన్నపై సీఐడీ దర్యాప్తు కొనసాగించుకోవచ్చు: హైకోర్టు

author img

By

Published : Nov 9, 2022, 1:13 PM IST

Updated : Nov 9, 2022, 2:07 PM IST

HC ON AYYANNA : మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడిపై నమోదైన భూఆక్రమణ కేసు కొట్టివేయాలని దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు తీర్పు వెలువరించింది. ఎన్‌ఓసీ విలువ ఆధారిత సెక్యూరిటీ కిందకు రాదని తెలిపింది. అయ్యన్నపై సీఐడీ దర్యాప్తు కొనసాగించుకోవచ్చని న్యాయస్థానం చెప్పింది.

high court on ayyanna case
high court on ayyanna case

HIGH COURT ON AYYANNA : తెదేపా సీనియర్‌ నేత, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడిపై నమోదైన భూఆక్రమణ కేసు కొట్టివేయాలని దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు తీర్పు వెలువరించింది. ఈకేసులో ఆయ్యన్నపై నమోదు చేసిన 467 సెక్షన్ వర్తించదని స్పష్టం చేసింది. 41ఏ నిబంధనలు అమలు చేయాలని ధర్మాసనం ఆదేశించింది. ఎన్‌ఓసీ విలువ ఆధారిత సెక్యూరిటీ కిందకు రాదని తెలిపింది. అయ్యన్నపై సీఐడీ దర్యాప్తు కొనసాగించుకోవచ్చని న్యాయస్థానం చెప్పింది. 0.16 సెంట్ల జలవనరుల శాఖ భూమిని ఆక్రమించారని అయ్యన్నపై ఏపీ ప్రభుత్వం కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.

ఇవీ చదవండి:

Last Updated :Nov 9, 2022, 2:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.