ETV Bharat / state

గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఆగని మరణాలు.. రెండు నెలల్లో ఐదుగురు మృతి

author img

By

Published : Dec 28, 2022, 2:07 PM IST

Five Students Death With In Two Months:గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో రెండు నెలల వ్యవధిలో అస్వస్థతకు గురై ఐదుగురు మృతి చెందారు. అధికారులు పరిష్కారం చూపకుండా నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. బుధవారం తెల్లవారుజామున ధోని అనే విద్యార్థి తీవ్ర అస్వస్థతకు గురై చనిపోయాడు. ఈ ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లాలో చోటుచేసుకుంది.

రెండు నెలల వ్యవధిలో ఐదుగురు మృతి
Five Students Death With In Two Months

Five Students Death With In Two Months:గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో తీవ్ర అస్వస్థతకు గురై చికిత్స పొందుతూ మరణించిన ఘటన అల్లూరి సీతరామరాజు జిల్లాలో చోటుచేసుకుంది. పాడేరు తలారసింగి బాలుర ఆశ్రమ పాఠశాలలో ఎనిమిదవ తరగతి చదువుతున్న ధోని తెల్లవారుజామున తీవ్ర అస్వస్థతకు గరయ్యాడు. దీంతో అతనిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. రెండు నెలల వ్యవధిలో ఆశ్రమ పాఠశాలలో అస్వస్థతకు గురై ఐదుగురు మృతి చెందడంపై విద్యార్థి సంఘ నాయకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల మరణాలపై పాఠశాల అధికారులు సమాధానం చెప్పాలంటూ బంధువులు, విద్యార్థి సంఘ నాయకులు ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగటంతో పోలీసులు మోహరించారు.

ఐదుగురు మృతి చెందడంపై విద్యార్థి సంఘ నాయకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.