తెలంగాణ: తుకారాంకు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి అభినందన

author img

By

Published : Feb 3, 2021, 4:30 PM IST

president and vice president appreciate Mountaineer angoth thukaram

మౌంట్‌ ఎవరెస్ట్‌ శిఖరం అధిరోహించిన తెలంగాణ యువకుడు ఆంగోత్‌ తుకారాంను రాష్ట్రపతి రామ్‌నాథ్‌ గోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అభినందించారు. దిల్లీలో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతిలను వారి అధికారిక నివాసంలో తుకారాం మర్యాదపూర్వంగా కలిశారు.

తెలంగాణకు చెందిన పర్వతారోహకుడు ఆంగోతు తుకారాం దిల్లీలో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతిలను వారి అధికారిక నివాసంలో మర్యాదపూర్వంగా కలిశారు. మౌంట్‌ ఎవరెస్ట్‌ శిఖరం అధిరోహించిన ఆంగోత్‌ తుకారాంను రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి అభినందించారు. అధిరోహించిన శిఖరాలపై.. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఐయామ్ నోట్ ఆన్ ది టాప్ ఆఫ్ ది వరల్డ్, సందేశాన్ని ఇవ్వడం అభినందనీయమని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ గోవింద్‌ అన్నారు.

అతి పిన్న వయసులోనే 4 పర్వతాలను ఆధిరోహించడం సాహసమని కొనియాడారు. మరో రెండు పర్వతాలను అధిరోహించిన తర్వాత మళ్లీ కలుద్దామని తుకారాంకు రాష్ట్రపతి హామీ ఇచ్చారు. త్వరలో పర్వతారోహకులకు ప్రత్యేకంగా ఒక అకాడమిని ఏర్పాటు చేయనున్నట్లు తుకారం రాష్ట్రపతికి తెలిపారు. తుకారం ఏర్పాటు చేసే అకాడమికి ప్రభుత్వం అన్ని విధాలుగా సహాకారం అందిస్తునందని రాష్ట్రపతి చెప్పారు. తుకారాం మరిన్ని పర్వతాలను అధిరోహించాలని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆకాంక్షించారు.

ఇదీ చదవండి: ఈ - వాచ్‌ యాప్‌.. ఆవిష్కరించిన ఎస్ఈసీ నిమ్మగడ్డ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.