ETV Bharat / jagte-raho

తెలంగాణ: పెళ్లైన 20 రోజులకే... భర్తను చంపేసింది

author img

By

Published : Sep 11, 2020, 8:06 PM IST

పెళ్లై పట్టుమని నెల కూడా కాలేదు. ప్రేమగా చూసుకోవాల్సిన భర్త రోజూ మద్యం తాగుతూ భార్యను చిత్రహింసలకు గురి చేసేవాడు. ఎన్నో ఆశలతో పెళ్లి చేసుకున్న ఆమె వేధింపులు తట్టుకోలేకపోయింది. ఆవేశంలో భర్తను రోకలిబండతో కొట్టింది.

wife killed husband for his harassment
తెలంగాణ: పెళ్లైన 20 రోజులకే... భర్తను చంపేసింది

తెలంగాణలోని హైదరాబాద్ టప్పాచబుత్ర పోలీస్ స్టేషన్ పరిధిలోని ముజాహిద్​నగర్​లో భర్త వేధింపులు తట్టుకోలేక భర్తను చంపింది ఓ భార్య. స్థానికంగా నివాసముండే అస్లాంకి 20 రోజుల క్రితం సమ్రేన్​తో వివాహమైంది. అప్పటినుంచి అస్లాం మద్యం సేవించి భార్యను చిత్రహింసలకు గురి చేసేవాడు. ఈ రోజు ఉదయం కూడా మద్యం సేవించి... భార్యను కొట్టాడు. తట్టుకోలేకపోయిన సమ్రేన్ రోకలిబండతో భర్త తలపై కొట్టింది.

వెంటనే తీవ్ర రక్తస్రావంతో అస్లాం స్పృహ తప్పిపోగా.. కుటుంబ సభ్యులు అతనిని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి: భర్త మార్కెట్​కు వెళ్లొచ్చేలోగా.. అదృశ్యమైన భార్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.