ETV Bharat / jagte-raho

న్యాయానికి పోలీసుల భరోసా: యువతి అంత్యక్రియలు పూర్తి!

author img

By

Published : Oct 15, 2020, 12:09 AM IST

nandini funerals completed at kaliambakam village
nandini funerals completed at kaliambakam village

ప్రియుడి చేతిలో మోసపోయానని భావించి ఆత్మహత్యకు పాల్పడ్డ నందిని అంత్యక్రియలు ముగిశాయి. మంగళవారం సాయంత్రం నుంచి ప్రియుడి ఇంటిముందు మృతదేహాంతో ఆందోళనకు దిగిన ఆమె కుటుంబసభ్యులు.. చివరికి గ్రామపెద్దల జోక్యంతో వెనక్కితగ్గారు. బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని పోలీసులు హామీనిచ్చారు.

చిత్తూరు జిల్లా విజయపురం మండలం కళియంబాకంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అదుపులోకి వచ్చాయి. గ్రామానికి చెందిన పృథ్వి మోసం చేశాడంటూ... నందిని అనే యువతి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ఆమె మృతదేహాంతో ప్రియుడి ఇంటి ముందు మంగళవారం సాయంత్రం నుంచి కుటుంబసభ్యులు, బంధువులు... ఆందోళనకు దిగారు.

ఫలితంగా గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని పంచాయతీ పెద్దలు, పోలీసులు హామీ ఇచ్చారు. వారి మాటతో వెనక్కు తగ్గిన బాధిత కుటుంబ సభ్యులు... నందిని మృతదేహానికి దహన క్రియలు పూర్తి చేశారు.

ఇదీ చదవండి:

ప్రేమించినవాడు మోసం చేశాడని...

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.