ETV Bharat / jagte-raho

పోలీసులు కొట్టారనే మనస్థాపంతో రైతు ఆత్మహత్యాయత్నం!

author img

By

Published : Oct 30, 2020, 4:58 AM IST

ఓ రైతుతో జరిగిన వివాదం కారణంగా మరో రైతును పోలీసులు స్టేషన్​కు పిలిపించి కొట్టడంతో బాధిత రైతు వెంకటేశ్వర్లు ఆత్మహత్యాయత్నం చేశారు. చికిత్స నిమిత్తం బాధితుడ్ని వినుకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.

పోలీసులు కొట్టారనే మనస్థాపంతో రైతు ఆత్మహత్యాయత్నం
పోలీసులు కొట్టారనే మనస్థాపంతో రైతు ఆత్మహత్యాయత్నం

గుంటూరు జిల్లా నూజెండ్ల మండలం చెరుకుపాలేనికి చెందిన రైతు వెంకటేశ్వర్లు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వెంకటేశ్వర్లను వైద్య చికిత్స నిమిత్తం బంధువులు వినుకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.

ఫిర్యాదు తీసుకోకపోగా.. కొట్టారు

అయినవోలు పోలీసులు కొట్టారనే మనస్తాపంతోనే తన భర్త వెంకటేశ్వర్లు ఆత్మహత్యాయత్నం చేసినట్లు బాధితుడి భార్య లక్ష్మీ ఆరోపించారు. ఓ రైతుతో ఏర్పడిన వివాదం మూలంగా తన భర్త వెంకటేశ్వర్లుని పోలీస్​స్టేషన్​కు పిలిచి ఫిర్యాదు స్వీకరించలేకపోగా.. తిరిగి కొట్టారని లక్ష్మీ ఆవేదన వ్యక్తం చేశారు. సదరు పోలీస్ అధికారిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని బాధితురాలు వేడుకుంటున్నారు.

ఇవీ చూడండి : సెంటు భూమి పేరుతో 4 వేల కోట్లు దోచుకున్నారు: కాల్వ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.