ETV Bharat / jagte-raho

హైదరాబాద్​లో హిజ్రాపై పెట్రోల్ పోసి నిప్పంటించిన మరో వర్గం

author img

By

Published : Oct 12, 2020, 9:44 PM IST

హైదరాబాద్​లో హిజ్రాపై పెట్రోల్ పోసి నిప్పంటించిన మరో వర్గం
హైదరాబాద్​లో హిజ్రాపై పెట్రోల్ పోసి నిప్పంటించిన మరో వర్గంహైదరాబాద్​లో హిజ్రాపై పెట్రోల్ పోసి నిప్పంటించిన మరో వర్గం

హైదరాబాద్‌ మాదాపూర్ పరిధిలో హిజ్రాపై మరో హిజ్రా వర్గం పెట్రోల్ పోసి నిప్పంటించింది. విభేదాల విషయంలో మాట్లాడుకుందామని పిలిచి.. ఈ దాడికి పాల్పడినట్టు తెలుస్తోంది.

ఎర్రగడ్డ అవంతినగర్​కు చెందిన హిజ్రా హంసకు... చందానగర్‌లోని మరికొందరు హిజ్రాలతో విభేదాలున్నాయి. ఈ విషయంలో మాట్లాడుకుందామని హంసను మరో వర్గం పిలిచింది. నిన్న రాత్రి హైటెక్‌ సిటీ రైల్వేస్టేషన్‌ వద్దకు రావాలని సమాచారం ఇచ్చింది.

ఆ సమయంలో... హంసపై మరో వర్గం హిజ్రాలు పెట్రోల్ పోసి నిప్పు పెట్టి పారిపోయారని తెలుస్తంది. బాధితురాలికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.