ETV Bharat / international

30 వేలు దాటిన భూకంప మృతుల సంఖ్య.. 147 గంటలు మృత్యువుతో పోరాడి గెలిచిన చిన్నారి

author img

By

Published : Feb 12, 2023, 8:28 PM IST

ప్రకృతి విలయానికి విలవిల్లాడిన తుర్కియే, సిరియాలో మరణాల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఈ భూప్రళయానికి మరణించిన వారి సంఖ్య 30,000 దాటింది. అయితే కొందరు భూకంప బాధితులు మృత్యుంజయులుగా నిలుస్తున్నారు. ఆరు రోజులైనా మృత్యువుతో పోరాడి గెలిచి.. శిథిలాల నుంచి సజీవంగా బయటపడుతున్నారు. తాజాగా పదేళ్ల వయసున్న ఓ చిన్నారి శిథిలాల కింద ఏకంగా 147 గంటలపాటు మృత్యువుతో పోరాడి విజయం సాధించింది.

turkey syria earthquake
turkey syria earthquake

ప్రకృతి విలయ తాండవానికి తుర్కియే, సిరియాల్లో మరణ మృదంగం మోగుతోంది. అంతకంతకూ పెరుగుతూవస్తున్న మృతుల సంఖ్య.. ప్రస్తుతం 30,000 దాటింది. భూకంప సహాయక చర్యల్లో అత్యంత కీలక సమయం ముగిసినా సరే.. ఇంకా అనేక మంది మృత్యువుతో పోరాడి విజయం సాధించి సజీవంగా బయటపడుతున్నారు. తాజాగా తుర్కియేలోని అంతక్యా నగరంలో ఓ చిన్నారి ఏకంగా 147 గంటలపాటు శిథిలాల కింద మృత్యువుతో పోరాడి గెలిచింది. పాక్షికంగా దెబ్బతిన్న భవనంలో నుంచి 'కుడి' అనే చిన్నారిని సహాయక బృందం సురక్షితంగా రక్షించింది. విపరీతమైన చలి, ఆహారంలేమి, పైన శిథిలాలు ఉన్నా ఆ చిన్నారి ధైర్యం కోల్పోకుండా ఉంది. నీరసంగా ఉండడం వల్ల కుడిని అధికారులు వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

turkey syria earthquake
శిథిలాల నుంచి బయటపడిన చిన్నారి

శిథిలాల కింద చిక్కుకున్న వారు వారం రోజులపాటు జీవించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నా.. రోజులు గడిచేకొద్ది తమ ఆశలు సన్నగిల్లుతున్నాయని కుటుంబ సభ్యులు, బంధువులు విలపిస్తున్నారు. మరోవైపు కొద్దిమంది జీవించి ఉన్నా నీరసం కారణంగా.. అరవలేరని అలాంటి వారిని గుర్తించేందుకు థర్మల్ కెమెరాలను ఉపయోగిస్తున్నట్లు రెస్య్కూ సిబ్బంది తెలిపింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.