ETV Bharat / crime

ఆ పనులు వద్దన్నందుకు స్థానికులపై యువకుల దాడి

author img

By

Published : Apr 22, 2022, 1:44 PM IST

youngers  allegedly attacked locals
అసాంఘిక చర్యలకు పాల్పడుతున్నారని ప్రశ్నించిన స్థానికులపై యువకుల దాడి

Attack: అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ప్రశ్నించిన స్థానికులపై యువకులు దాడికి పాల్పడ్డారు. స్థానికులపై కర్రలు, రాళ్లతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన పల్నాడు జిల్లాలో జరిగింది.

Attack: పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం కేశానుపల్లిలో యువకులు వీరంగం సృష్టించారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ప్రశ్నించిన స్థానికులపై దాడికి పాల్పడ్డారు. పట్టణంలోని పనసతోటకు చెందిన కొందరు యువకులు కాలనీలో అసాంఘిక చర్యలకు పాల్పడుతుంటే మాతంగి రామయ్య అనే వ్యక్తి ప్రశ్నించినట్లు స్థానికులు తెలిపారు. దాంతో కక్ష పెంచుకున్న ఆ యువకులు అర్ధరాత్రి సమయంలో మాస్కులు ధరించి వారి ఇళ్లపై దాడి చేశారన్నారు. ఇంటిలోని ఫర్నిచర్ ధ్వంసం చేసి కర్రలు, రాళ్లతో విచక్షణారహితంగా కొట్టారని వారు వాపోయారు. ఇరువర్గాల పరస్పర దాడుల్లో ఆరుగురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని నరసరావుపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. స్థానికుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న నరసరావుపేట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి: CYLINDER BLAST: గుంటూరు జిల్లా బ్రాహ్మణకోడూరులో ప్రమాదం.. సిలిండర్ పేలి ఒకరు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.