ATTACK: బీమా రెన్యూవల్ చేయమని అడిగిన వ్యక్తిని.. ఆ ఉద్యోగి ఏం చేశాడంటే?

author img

By

Published : Jun 22, 2022, 8:43 AM IST

ATTACK

ATTACK: వైఎస్ఆర్ బీమా రెన్యూవల్ చేయమని అడిగిన ఓ వ్యక్తిపై.. గ్రామ సచివాలయ వెల్ఫేర్‌ అసిస్టెంట్ సహనం కోల్పోయాడు. తన చేతికున్న కడియంతో ఆ వ్యక్తి తలపైన బలంగా కొట్టడం వల్ల గాయపడిన అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన వైఎస్సార్​ జిల్లాలో జరిగింది.

ATTACK: వైఎస్సార్​ జిల్లా కమలాపురం మండలం గంగవరంలో గ్రామ సచివాలయ వెల్ఫేర్‌ అసిస్టెంట్ సహనం కోల్పోయాడు. వైఎస్ఆర్ బీమా రెన్యూవల్ చేయమని అడిగిన ఓ వ్యక్తిపై దాడి చేశాడు. గ్రామానికి చెందిన కామనూరు చిన్ననాగయ్య.. వైఎస్సార్​ బీమా రెన్యువల్ చేయాలంటూ..గ్రామ సచివాలయానికి వెళ్లారు. వెల్ఫేర్‌ అసిస్టెంట్ చంద్రను.. బీమా రెన్యూవల్‌ చేయాలని కోరారు. దీనికి దురుసుగా సమాధానం చెప్పిన వెల్ఫేర్‌ అసిస్టెంట్‌ ఆ తర్వాత తీవ్ర పదజాలంతో దూషించాడని బాధితుడు వాపోయారు. ఈ క్రమంలోనే వెల్ఫేర్‌ అసిస్టెంట్‌ చంద్ర తన చేతికున్న కడియంతో తలపైన బలంగా కొట్టడం వల్ల గాయపడినట్లు నాగయ్య చెప్పారు. కడప రిమ్స్‌లో చికిత్స పొందిన బాధితుడు..దాడి చేసిన వెల్ఫేర్ అసిస్టెంట్ చంద్రపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

బీమా రెన్యూవల్ చేయమని అడిగిన వ్యక్తిని.. ఆ ఉద్యోగి ఏం చేశాడంటే?

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.