ETV Bharat / crime

దారి తప్పారు.. సరుకు వదిలేశారు..!

author img

By

Published : Aug 9, 2021, 10:44 PM IST

ఎరక్కపోయి ఇరుక్కోవడం అంటే ఇదే..! పక్కా ప్రణాళికతో గంజాయిని కొనుగోలు చేసి ఉంటారు. తరలించే క్రమంలో ఏం జరిగిందో తెలియదు కానీ.. సుమారు 50 లక్షల రూపాయల విలువ చేసే 560 కిలోల గంజాయిని కారులో వదిలి పరారయ్యారు. ఈ ఘటన విశాఖ జిల్లా నిందితులు విశాఖ జిల్లా రోలుగుంట మండలం అడ్డసరం వద్ద జరిగింది. కారులో లభ్యమైన కాగితాల ఆధారంగా వివరాలు సేకరిస్తున్నామని పోలీసులు తెలిపారు.

visakha
visakha

విశాఖ జిల్లా రోలుగుంట మండలం అడ్డసరం శివారు దెబ్బల పాలెం సమీపంలో గంజాయి లోడు చేసిన వాహనాన్ని గుర్తు తెలియని వ్యక్తులు వదిలి పరారయ్యారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు రోలుగుంట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. AP 31 CG 9997 నెంబర్ గల వాహనంలో సుమారు 50 లక్షల రూపాయల విలువ చేసే 560 కిలోల గంజాయిని కారులో నింపి గ్రామ సమీపంలో వదిలి నిందితులు పరారైనట్లు ఎస్సై నాగ కార్తీక్ తెలిపారు.

ఈ గంజాయిని విశాఖ మన్యంలో కొనుగోలు చేసి రహస్య మార్గాల మీదుగా తరలించే ప్రయత్నంలో రహదారి మరిచి వాహనాన్ని నిలిపి వేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. కారులో లభ్యమైన కాగితాల ఆధారంగా వివరాలు సేకరిస్తున్నామని ఎస్సై పేర్కొన్నారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు.

ఇదీ చదవండి:

చైన్ స్నాచర్ అరెస్ట్.. చోరీ చేసి పారిపోతుండగా పట్టిచ్చిన స్థానికుడు!

విషాదాంతం : అదృశ్యమైన బాలుడు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.