ETV Bharat / crime

వారిద్దరూ ఆలయంలో చోరీ చేయబోయారు.. సరిగ్గా అప్పుడే..!

author img

By

Published : Nov 14, 2021, 1:04 PM IST

అనంతపురం జిల్లా ఉరవకొండలోని మల్లేశ్వర స్వామి ఆలయంలో ఇద్దరు దుండగులు చోరీకి యత్నించారు. అదే సమయంలో అర్చకులు రావడంతో.. తమ ద్విచక్రవాహనాన్ని అక్కడే వదిలిపెట్టి పారిపోయారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

two-people-attempted-to-theft-at-uravakonda-malleshwara-swamy-temple
వారిద్దరూ ఆలయంలో చోరీ చేయబోయారు.. సరిగ్గా అప్పుడే..!

అనంతపురం జిల్లా ఉరవకొండ మండల కేంద్రంలోని పురాతన మల్లేశ్వర స్వామి ఆలయంలో ఈరోజు ఉదయం ఇద్దరు వ్యక్తులు దొంగతనానికి ప్రయత్నించారు. సరిగ్గా అదే సమయంలో అర్చకులు ఆలయంలోకి రావడంతో... వారిని తోసేసి దుండగులు పారిపోయారు. అయితే.. ఈ ఇద్దరు దొంగలు ఈనెల 10వ తేదీన ఆలయంలో రెక్కీ నిర్వహించారు. ఎవరికీ తెలియకూడదనే ఉద్దేశ్యంతో.. సీసీ కెమెరాలు ఆఫ్ చేశారు. ఈ దృశ్యాలన్నీ సీసీటీవీ కెమెరాలో నిక్షిప్తమయ్యాయి.

వారిద్దరూ ఆలయంలో చోరీ చేయబోయారు.. సరిగ్గా అప్పుడే..!

పథకం ప్రకారం ఈ రోజు ఉదయం చోరీకి యత్నించి విఫలమయ్యారు. ఎక్కడ దొరికిపోతామోనన్న భయంతో తమ వాహనాన్ని అక్కడే వదిలిపెట్టి పారిపోయారు. అర్చకుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు... నిందితుల ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. సీసీటీవీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి: POLLING START: ప్రశాంతంగా సాగుతున్న.. స్థానిక ఎన్నికల పోలింగ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.