ETV Bharat / crime

దొంగల బీభత్సం.. ఏటీఎం నుంచి రూ.7 లక్షలు మాయం?

author img

By

Published : Feb 8, 2021, 3:28 PM IST

తెలంగాణ నల్గొండ జిల్లా చిట్యాల మండలంలో అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. వెలిమినేడులో ఇండీక్యాష్​ ఏటీఎంను లూటీ చేసిన దుండగులు.. చిట్యాల ఏటీఎంలో దొంగతనానికి విఫలయత్నం చేశారు.

ATM_CHORI
ATM_CHORI

దొంగల బీభత్సం.. ఏటీఎంలో చోరీకి విఫలయత్నం

తెలంగాణ నల్గొండ జిల్లా చిట్యాల మండలంలో అర్ధరాత్రి దొంగలు హల్​చల్ చేశారు. వట్టిమర్తి వద్ద కారు చోరీ చేసిన దొంగలు...చిట్యాల ఏటీఎంలో దొంగతనానికి విఫలయత్నం చేశారు. వెలిమినేడులో ఇండీక్యాష్‌ ఏటీఎంను లూఠీ చేసినట్లు పోలీసులు గుర్తించారు.

సుమారు 7 లక్షలు చోరీ జరిగినట్లు గుర్తించారు. మొదట దొంగిలించిన కారులో డీజిల్‌ అయిపోవడంతో.. రహదారిపై వదిలేసి మరో కారును ఎత్తుకెళ్లారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి:

పెరుగుతున్న భూతాపం- హిమాని నదులకు పెనుశాపం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.