ETV Bharat / crime

Shilpa Chowdary custody news: శిల్పా చౌదరిని కస్టడీకి తీసుకున్న పోలీసులు

author img

By

Published : Dec 3, 2021, 2:13 PM IST

Shilpa Chowdary custody news: అధిక వడ్డీల పేరుతో జనాల నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసిన కేసులో.. నిందితురాలు శిల్పా చౌదరిని పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. రెండు రోజులపాటు సాగనున్న విచారణలో.. అన్ని కోణాల్లోనూ శిల్పను విచారించనున్నారు నార్సింగి పోలీసులు.

Shilpa Chowdary custody news
Shilpa Chowdary custody news

Shilpa Chowdary custody news : పెట్టుబడుల పేరుతో పెద్ద ఎత్తున మోసాలకు పాల్పడిన మహిళ.. శిల్పా చౌదరిని తెలంగాణ నార్సింగి పోలీసులు రెండు రోజుల కస్టడీ తీసుకున్నారు. చంచల్​గూడ మహిళా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న శిల్పను.. ఉస్మానియా ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం నార్సింగి ఠాణాకు తీసుకెళ్లారు. శిల్ప ఎవరెవరి వద్ద నుంచి ఎంత సొమ్ము తీసుకుందనే వివరాలు రాబట్టనున్నారు. డబ్బులు ఎక్కడకు మళ్లించారు.. బ్యాంకు ఖాతాలకు సంబంధించిన లావాదేవీల సంగతేంటి? అనే వివరాలను పోలీసులు లోతుగా ఆరా తీయనున్నారు.

శిల్పా చౌదరిపై నార్సింగి పోలీస్‌ స్టేషన్‌లో ముగ్గురు మహిళలు ఫిర్యాదు చేయగా.. రూ.7 కోట్ల 5లక్షలు తీసుకుందని పోలీసులు గుర్తించారు. ఫిర్యాదు చేసిన వారిలో సినీ హీరో మహేశ్ బాబు సోదరి ప్రియాంక సైతం ఉన్నారు. శిల్పకు రూ.2కోట్లకు పైగా ఇచ్చానని ప్రియాంక తెలిపారు. డబ్బులు తీసుకున్న తర్వాత శిల్ప ఇచ్చిన బ్యాంకు చెక్కులు చెక్కులు చెల్లకపోవడంతో.. బాధితులు పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. 7 రోజుల కస్టడీకి ఇవ్వాలని ఉప్పర్‌పల్లి కోర్టును పోలీసులు కోరగా.. రెండు రోజులు విచారణ చేసేందుకు న్యాయస్థానం అనుమతించింది. శిల్ప ఓ చిన్న చిత్రాన్ని నిర్మించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఇప్పటికే శిల్ప బ్యాంకు ఖాతాల వివరాలను పోలీసులు సేకరించారు.

కిట్టీ పార్టీలతో ఆకట్టుకుంటూ..
Shilpa Chowdary Cheating Case: కిట్టీ పార్టీల పేరుతో మహిళలను ఆకట్టుకున్న శిల్పాచౌదరి.. స్థిరాస్తి వ్యాపారం కోసమంటూ డబ్బు తీసుకుందని పోలీసులు గుర్తించారు. భారీగా లాభాలిస్తానని నమ్మించి మోసం చేసిందని ఫిర్యాదులు అందాయి. గండిపేటలోని సిగ్నేచర్‌ విల్లాలో పదేళ్లుగా నివాసముంటున్న శిల్పాచౌదరి, శ్రీకృష్ణ శ్రీనివాస్‌ ప్రసాద్‌ దంపతులు తమకు తాము ధనవంతులుగా ప్రకటించుకున్నారు. టీవీ, సినీ నిర్మాతగా పరిచయం చేసుకున్న శిల్పాచౌదరి సినీప్రముఖుల కుటుంబాల్లోని మహిళలను తరచూ కలుసుకుంటూ వారాంతాల్లో పార్టీల పేరుతో ఆహ్వానించేది. తొలుత కొంతమందితో మొదలైన కిట్టీ పార్టీలను తర్వాత జూదంగా మార్చింది. దివానోస్‌ పేరుతో జూదశాలను ప్రారంభించింది. సంపన్న కుటుంబాలకు చెందిన మహిళల్లో 90 మందిని సభ్యులుగా చేర్పించుకుంది. వారాంతాల్లో విందులు, వినోదాలు ఏర్పాటు చేసేది.

అధిక వడ్డీలంటూ మోసం..
Shilpa Chaudhary case: అధిక వడ్డీ ఇస్తానంటూ కోట్ల రూపాయలు మోసాలకు పాల్పడిన శిల్పాచౌదరి బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. తన వద్ద 2.4 కోట్లు తీసుకుని మోసం చేసిందని నార్సింగి ఠాణాలో మరో మహిళ ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన నార్సింగి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గతేడాది అధిక వడ్డీ ఇస్తానని డబ్బు తీసుకుందని.. ఇవ్వకుండా మోసం చేసిందని బాధితురాలి ఫిర్యాదులో పేర్కొంది. నార్సింగి పీఎస్​లోనే శిల్పా చౌదరిపై మొత్తం మూడు కేసులు నమోదయ్యాయి.

'మోసాలతో విలాసాలు..'
Shilpa fraud: మోసం చేయడమే ఆమె లక్ష్యం. భార్య చేసే మోసాలకు వత్తాసు పలకడమే భర్త లక్షణం. అధిక వడ్డీలు, వ్యాపారాల్లో లాభాల పేరిట వల వేసి.. వారి నుంచి కోట్లలో డబ్బులు తీసుకుని.. విలాసవంతమైన జీవితాన్ని గడపడమే ఆ దంపతుల ధ్యేయం. అలా మోసాలకు పాల్పడిన శిల్పా చౌదరి (Shilpa fraud) గుట్టు ఎట్టకేలకు బయటపడింది. హైదరాబాద్​కు చెందిన వ్యాపారవేత్త శిల్పను, ఆమె భర్త శ్రీనివాస్​ను నార్సింగి పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో దర్యాప్తు కోసం శిల్పను 2 రోజుల కస్టడీకి కోర్టు అనుమతించింది. ఆమె భర్తకు మాత్రం బెయిల్ మంజూరు చేసింది.

ఇదీ చదవండి:

Shilpa Chowdary Cheating Case : శిల్పాచౌదరి చేతిలో మోసపోయిన హీరో మహేశ్​బాబు సోదరి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.