ETV Bharat / crime

AP Crime News: విద్యుదాఘాతంతో ఇద్దరు కూలీలు మృతి.. భర్త చేతిలో భార్య హత్య

author img

By

Published : Jul 2, 2022, 5:30 AM IST

రాష్ట్రవ్యాపంగా జరిగిన వేర్వేరు ఘటనలో నలుగురు చనిపోయారు. ప్రకాశం జిల్లాలో రొయ్యల చెరువు వద్ద విద్యుధాఖాతంతో ఇద్దరు కూలీలు చనిపోగా.. శ్రీకాకుళం జిల్లాలో భార్య.. భర్త చేతలో హత్యకు గురైంది.

AP Crime News
AP Crime News

ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం ఈతముక్కల వద్ద విషాదం చోటుచేసుకుంది. స్థానిక రొయ్యలచెరువు వద్ద విద్యుదాఘాతంతో ఇద్దరు కూలీలు మృతిచెందారు. మృతులు.. నెల్లూరుకు చెందిన కామయ్య, దశరథగా పోలీసులు గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలంలో పద్మతులలో దారుణం జరిగింది. భర్త, ఆమె మామ కలిసి.. వివాహితను హత్య చేశారు. సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న కంచిలి పోలీసులు.. నిందితులను అరెస్టు చేశారు. హత్యకు కుటుంబకలహాలే కారణమని భావిస్తున్న పోలీసులు.. ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

murder in vizianagaram district: విజయనగరం జిల్లా రామభద్రపురం మండలం అరికతోటలో ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. అరికతోటకు చెందిన వర్రి చిన్నోడు(57).. ఒంటరిగా వెళ్తుండగా... ప్రత్యర్థులు దారికాచి హతమార్చారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.