ETV Bharat / crime

Bus Accident: నెల్లూరు జిల్లాలో ఆగి ఉన్న లారీని ఢీకొన్న బస్సు.. ఒకరు మృతి

author img

By

Published : Mar 23, 2022, 12:26 PM IST

Updated : Mar 23, 2022, 5:08 PM IST

Bus Accident
నెల్లూరు జిల్లాలో ఆగి ఉన్న లారీని ఢీకొన్న బస్సు

Bus Accident: నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం దామరమడుగు సమీపంలో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందగా.. 30మందికి గాయాలయ్యాయి.

Bus Accident: నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం దామరమడుగు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆత్మకూరు నుంచి నెల్లూరు వైపుకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు.. దామరమడుగు వద్ద ఆగి ఉన్న లారీని ఢీ కొట్టి.. పక్కనున్న పంట పొలంలో బోల్తా పడింది. ప్రమాద సమయంలో బస్సులో 35 మంది ప్రయాణికులు ఉండగా.. వారిలో ఒకరు ఘటనాస్థలంలోనే మృతి చెందారు. 30 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను నెల్లూరు ఆస్పత్రికి తరలించారు.

నెల్లూరు జిల్లాలో ఆగి ఉన్న లారీని ఢీకొన్న బస్సు

అప్రమత్తమైన అధికారులు: విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ విజయారావు.. అధికారులను అప్రమత్తం చేశారు. అనంతరం వైద్యులతో మాట్లాడి వివరాలను తెలిసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ప్రస్తుతం అందురు కోలుకుంటున్నట్లు వైద్యులు తెలిపారు. కానీ నలుగురి పరిస్థితి మాత్రం విషమంగా ఉందన్నారు. ఆస్పత్రి వద్ద బాధితులకు కావల్సిన అన్ని వసతులను ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులు సమకూరుస్తున్నారు.

ఇదీ చదవండి: Disha Patrol Vehicles: దిశ వాహనాలను ప్రారంభించిన సీఎం జగన్

Last Updated :Mar 23, 2022, 5:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.