ETV Bharat / crime

ACCIDENT: రెండు లారీలు ఢీ.. ఇద్దరు మృతి

author img

By

Published : May 25, 2022, 9:08 AM IST

ACCIDENT: బాపట్ల జిల్లా కొరిశపాడు మండలం మేదరమెట్ల జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న లారీని మరో లారీ ఢీకొట్టడంతో ఇద్దరు మృత్యువాత పడ్డారు.

ACCIDENT
బాపట్ల జిల్లాలో రెండు లారీలు ఢీ

ACCIDENT: బాపట్ల జిల్లా కొరిశపాడు మండలం మేదరమెట్ల జాతీయ రహదారిపై ప్రమాదం చోటుచేసుకుంది. ఒంగోలు నుంచి విజయవాడ వైపు నిమ్మకాయల లోడుతో వెళ్తున్న లారీని కోళ్లలోడుతో వెళ్తున్న మరో లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. మృతులు రాజా(30), శివ(26)లను ఎన్టీఆర్ జిల్లా వాసులుగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.