ETV Bharat / crime

ARREST: ప్రధాన స్మగ్లర్ అరెస్ట్.. రూ.3 కోట్ల విలువైన ఎర్ర చందనం స్వాధీనం

author img

By

Published : Jun 1, 2022, 4:28 PM IST

ARREST
ప్రధాన స్మగ్లర్ అరెస్ట్

ARREST: ఎర్ర చందనం అక్రమ రవాణాకు సంబంధించి ప్రధాన స్మగ్లర్ పెరుమాళ్​ను చిత్తూరు పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి నుంచి రూ.3 కోట్ల విలువైన 100 ఎర్ర చందనం దుంగలు, 4 వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ రిషాంత్ రెడ్డి తెలిపారు.

ARREST: ఎర్ర చందనం స్మగ్లర్ పెరుమాళ్​ను చిత్తూరు పోలీసులు అరెస్ట్ చేశారు. 3 కోట్ల రూపాయల విలువైన 100 ఎర్ర చందనం దుంగలు, 4 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. తిరుపతి-బెంగళూరు రోడ్డు చెర్లోపల్లి క్రాస్ వద్ద తనిఖీలు నిర్వహించిన చిత్తూరు పోలీసులు.. తిరుపతి నుంచి వేలూరు వైపుగా కారులో వెళ్తున్న స్మగ్లర్ పెరుమాళ్‌ను అదుపులోకి తీసుకున్నారు. వాహనం నడుపుతున్న వేలు అనే వ్యక్తిని పట్టుకున్నట్లు తెలిపారు. ప్రధాన ముద్దాయి పెరుమాళ్​పై జిల్లాలో అనేక కేసులు ఉన్నట్లు ఎస్పీ రిశాంత్​రెడ్డి వెల్లడించారు.

ప్రధాన స్మగ్లర్ అరెస్ట్

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.