ETV Bharat / crime

తనఖా పెట్టిన భూమిని అమ్మేశాడని వ్యక్తి కిడ్నాప్

author img

By

Published : Jul 17, 2022, 1:08 PM IST

Kidnap:తీసుకున్న అప్పు తిరిగి చెల్లించకపోవడంతో తనఖా పెట్టిన భూమిని అమ్మేశాడనే కోపంతో రెక్కీ నిర్వహించి కిడ్నాప్ చేసిన ఘటన.. గుంటూరు జిల్లా తెనాలిలో చోటుచేసుకుంది. పోలీసుల ఒత్తిడితో కిడ్నాప్ చేసిన వ్యక్తులే మూడవ పట్టణ పోలీసు స్టేషన్ వద్ద వదిలి వెళ్లారని.. బాధితుడు వెల్లడించారు.

man kidnapped for selling mortgaged land at guntur
తనఖా పెట్టిన భూమిని అమ్మేశాడని వ్యక్తి కిడ్నాప్

Kidnap: తీసుకున్న అప్పు తిరిగి చెల్లించకపోవడంతో తనఖా పెట్టిన భూమిని అమ్మేశాడనే కోపంతో రెక్కీ నిర్వహించి కిడ్నాప్ చేసిన ఘటన.. గుంటూరు జిల్లా తెనాలిలో జరిగింది. గల్లా శ్రీనివాస్ అనే న్యాయవాదికి.. రియల్ ఎస్టేట్ వ్యాపారి కోగంటి బాబ్జి నాలుగేళ్ల కిందట 10లక్షలు అప్పుగా ఇచ్చారు. ఏళ్లు గడుస్తున్నా తీసుకున్న అప్పు తిరిగి చెల్లించకపోవడంతో.. తనఖా పెట్టిన పొలాన్ని బాబ్జి అమ్మేశారు.

ఆ కక్షతోనే పలు రకాలగా తనను ఇబ్బంది పెడుతున్నారని బాబ్జి ఆరోపించారు. అందులో భాగంగానే స్వర్ణముఖి అపార్ట్మెంట్స్ దగ్గర నలుగురు వ్యక్తులతో కలిసి రెక్కీ నిర్వహించారని తెలిపారు. స్థానికులు, కుటుంబ సభ్యలు పోలీసులకి సమాచారమివ్వడంతో.. తనని విడిచి పెట్టినట్లు బాబ్జి తెలిపారు.

తనఖా పెట్టిన భూమిని అమ్మేశాడని వ్యక్తి కిడ్నాప్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.