ఉపాధ్యాయుల వేధింపులు తాళలేక.. విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

author img

By

Published : Sep 23, 2022, 3:03 PM IST

STUDENT SUICIDE ATTEMPT

TEACHERS HARASSMENTS : పిల్లలకు పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయులు వారితో కాళ్లు, చేతులు ఒత్తించుకుంటున్నారు. ఇదేమిటని ధైర్యం చేసిన అడిగిన విద్యార్థినిపై దూషణలకు దిగారు. దాంతో మనస్థాపం చెందిన ఆ విద్యార్థిని పాఠశాల భవనం పైనుంచి దూకి ఆత్మహత్యకు యత్నించింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.

STUDENT SUICIDE ATTEMPT : ఉపాధ్యాయుల వేధింపులు భరించలేక ఓ విద్యార్థిని ఆత్మహత్యకు యత్నించింది. పాఠశాల భవనం పైనుంచి దూకడంతో తీవ్ర గాయాలపాలైన ఆ విద్యార్థిని ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటన నంద్యాల జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసింది. జిల్లాలోని బండిఆత్మకూరు కేజీవీబీ( కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయం)లో పదో తరగతి చదువుతున్న విద్యార్థిని ఉపాధ్యాయుల వేధింపులు తాళలేక వారం క్రితం భవనం పైనుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. కాలికి తీవ్రగాయాలు కావడంతో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. పాఠశాల యాజమాన్యం ఈ ఘటనను తొలుత ప్రమాదంగా చిత్రీకరించారు.

ఉపాధ్యాయుల వేధింపులతో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.